ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని, పూజారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి మేడారం సందర్శించి తుది ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు.