మేడిగడ్డ బ్యారేజీ బాంబులతోనే కుంగింది.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

2 months ago 6
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు అని అన్నారు. అలాగే తన నియోజకవర్గంలోని చెక్ డ్యామ్‌లను కూడా బాంబులతో పేల్చివేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనలపై విచారణ జరపాలని ఆయన కోరారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. కాగా, తెలంగాణలో చెక్ డ్యామ్‌లు వరుసగా కూలిపోతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article