స్మగ్లర్లు కొత్త దందా మొదలుపెట్టారు. చట్టపరంగా పెద్దగా శిక్ష పడని మైనర్లను మత్తు దందాకు వాడుకుంటున్నారు. ఒడిశా కేంద్రంగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన ఓ మైనర్ బాలుడి వద్ద రూ. 1.15 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్ పట్టుబడింది. నిరుపేదలను డబ్బు ఆశచూపి మభ్యపెట్టి వారిని డ్రగ్స్ రవాణాకు వాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు.