ఖమ్మం జిల్లాలో 'మొంథా' తుపాను ప్రభావంతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో 92 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో ఖమ్మం-బోనకల్ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. పాలేరు జలాశయానికి కూడా వరద చేరుతుండటంతో అప్రమత్తత ప్రకటించారు.