మొంథా తుపాను దూసుకువస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న 12 జిల్లాల్లో రేపటి నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణి చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి రూ.3000 సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అలాగే 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తామని తెలిపారు.