మొంథా తుఫాను నష్టంపై అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఏ రంగాల్లో ఏ మేరకు నష్టం జరిగింది అనేది అధికారులు ప్రాథమికంగా నివేదికను అందజేశారు. ఈ నేపథ్యంలో పంట నష్టంపై ఐదు రోజుల్లోనే వివరాలను సమర్పించాలని సీఎం ఆదేశించారు. తుఫాను వల్ల ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని, విపత్తులను ఎవరూ ఆపలేరు కానీ, ముందస్తు చర్యలతో నష్టం తగ్గించవచ్చని సీఎం పేర్కొన్నారు.