మొంథా తుఫానుతో కలిగిన నష్టంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక అందించింది. తుఫాను వలన కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించిన ఏపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. తుఫాను కారణంగా రూ.5,244 కోట్ల మేర నష్టం కలిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 4,794 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయని.. . 1.38 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించి.. ఏపీకి సాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కోరారు.