మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లు, విమాన, ఆర్టీసీ బస్సు సర్వీసులు రద్దయ్యాయి. పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం 37 రైళ్లు, ఐదు విమాన సర్వీసులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. గురువారం కూడా కొన్ని రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.