ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించనుంది. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒక్కొక్కరికీ వేయి రూపాయలు అందించనున్నారు. అలాగే ఒక కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.3000 అందిస్తారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. మరోవైపు తుపాను బాధితులకు బియ్యం. నిత్యావసర సరుకులు కూడా అందించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.