మొక్కజొన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కూడా మద్దతు ధరకే మొక్కజొన్న పంట సేకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. మొక్కజొన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు మంత్రి తెలిపారు. సీఎం సూచన ప్రకారమే సేకరణ కొనసాగించనున్నట్లు తెలిపారు. అయితే కేంద్రం కేవలం మద్దతు ధర ప్రకటనలకే పరిమితం అవుతుందని.. కొనుగోళ్లు కూడా చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.