హైదరాబాద్లో జరిగిన అర్బన్ డెవలప్మెంట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 వేల ఎకరాల్లో నిర్మించనున్న 'భారత్ ఫ్యూచర్ సిటీకి' కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ను కోరారు. అంతేకాకుండా.. మూసీ పునరుజ్జీవం, ఆర్ఆర్ఆర్ (RRR), మెట్రో రైలు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9న 'తెలంగాణ విజన్ 2047' విడుదల చేస్తామని.. దేశ ఆర్థిక వ్యవస్థలో 10 శాతం వాటా లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం తెలిపారు.