Visakhapatnam Janasena Party Senatho Senani: జనసేన పార్టీ బలోపేతం కోసం విశాఖపట్నంలో మూడు రోజుల పాటు 'సేనతో సేనాని' సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తారు. ప్రతి నియోజకవర్గం నుండి సభ్యులను ఎంపిక చేసి, వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. చివరి రోజు భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.