Vangalapudi anitha on Cricket matches in Vizag: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పోలీసాఫీసర్ తన కూతురితో కలిసి మ్యాచ్ చూస్తున్న ఫోటోను వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ హోం మంత్రి అనిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు విశాఖ వేదికగా ఇప్పటికే భారత్ తన రెండు మ్యాచ్లను పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మరో రెండు మ్యాచ్లు జరగాల్సి ఉంది.