భారత్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 నుంచి 2024 వరకు భారత్.. ఒక దశాబ్దాన్ని నష్టపోయిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇది భారత విదేశాంగ విధానం వైఫల్యాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. హౌడీ మోడీ, నమస్టే ట్రంప్ వంటి కార్యక్రమాలతో ఏం సాధించారని ప్రధాని మోదీని ఓవైసీ ప్రశ్నించారు. హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా తీసుకున్న నిర్ణయంతో.. అత్యధికంగా నష్టపోయేది భారతీయులేనని ఓవైసీ ఆరోపించారు.