యాదగిరిగుట్టలో జరిగిన ‘ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో’ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మహిళా సంఘాలకు రూ. 12.73 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసి, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. పట్టణాభివృద్ధిలో భాగంగా రూ. 100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రూ. 210 కోట్లతో ఇంటింటికీ గోదావరి జలాలు అందించే పైప్లైన్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.