మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం సాంప్రదాయ చీరకట్టులో ఆలయానికి చేరుకున్న ఆమె.. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆమెకు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేయగా.. వేద పండితులు వేదాశీర్వచం ఇచ్చారు. యాదగిరిగుట్టను సందర్శించటం అదృష్టంగా భావిస్తున్నట్లు పిస్కోవా అన్నారు.