యాదాద్రి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఓ తల్లి కన్న కొడుకుకి ఉరేసి అనంతరం తాను సైతం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లిలో జరిగింది. మానసిక గుబులుతో ఆమె ఈఘటనకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.