యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో భారీ వర్షం ఆస్తి, పంట నష్టాన్ని కలిగించింది. నక్కలగూడెం గ్రామంలోని కోళ్లఫారంలో 6 వేల కోళ్లు మృతిచెందగా.. వరి, పత్తి పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలంగాణలో మరికొన్ని రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.