తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, హానికర రంగుల వాడకం, నాణ్యత లోపించిన ముడి సరుకులు వాడటం వంటి నిబంధనల ఉల్లంఘనలపై 17 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని, శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు.