పిఠాపురం పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న 60 ఏళ్ల అధికారి తన కుటుంబంతో సహా గోదావరిలో దూకాడు. రాజమండ్రి రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జి మీద నుంచి కుటుంబంలోని నలుగురు గోదావరిలో దూకగా.. పంచాయతీరాజ్ ఏఈ మనవడిని స్థానిక మత్స్యకారులు కాపాడారు, మిగతా ముగ్గురు గోదావరిలోనే గల్లంతయ్యారు. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న అధికారి ఇలా ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఘటనకు అసలు కారణాలు తెలసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.