రాజమహేంద్రవరం ప్రజలకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమానయానం అందుబాటులోకి రానుంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 1 నుంచి ఈ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఎలయన్స్ ఎయిర్ సంస్థ ఏటీఆర్ 72 విమానం వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని) ఈ సర్వీసును అందించేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా గంటా 45 నిమిషాల్లో తిరుపతి చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..