రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రూ. 4 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. దరఖాస్తు గడువు ఏప్రిల్ 14. నిజామాబాద్ విలీన గ్రామాల్లో దరఖాస్తుదారులకు గందరగోళం నెలకొంది. వారు తమ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ను సంప్రదించగా..ఆయన నగర కమిషనర్తో మాట్లాడి ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు.