తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెబుతూ.. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.6 వేల కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. రూ.50 వేలలోపు రుణాలకు నూరుశాతం రాయితీ వర్తింపజేయాలని సర్కార్ భావిస్తోంది. అంటే రూ.50 వేల లోపు లోన్లు తీసుకున్న వారు రూపాయి కూడా తిరిగి కట్టాల్సిన పనిలేదు.