తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం అమలుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. జూన్ 2వ తేదీ నుంచి అర్హులైన వారికి పత్రాలు మంజూరు చేయనున్నారు. జూన్ 15వ తేదీ తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దశలవారీగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు వేసినట్లు వెల్లడించింది. ఇక మొదటి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది.