Rajiv Swagruha 59 Plots for rs 46 Cr in Auction:హైదరాబాద్లో ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి రాజీవ్ స్వగృహ మంచి అవకాశం కల్పిస్తోంది. తక్కువ ధరకు.. ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని.. ప్రభుత్వ రంగ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న 163 ప్లాట్ల వేలం ప్రక్రియ ప్రారంభించింది. దీనిలో తొర్రూర్లో 59 ప్లాట్లను వేలం వేయగా, చదరపు గజం రూ.39 వేల వరకు పలికింది. మొత్తం రూ.46 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం కూడా మరిన్ని ప్లాట్లకు వేలం జరగనుంది.