హైదరాబాద్లో ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి రాజీవ్ స్వగృహ మంచి ఆఫర్ ఇస్తోంది. ఇప్పటికే 163 ప్లాట్లను వేలం వేయడానికి సిద్ధమైంది. తోర్రూర్లో 59 ప్లాట్లను వేలం వేయగా, చదరపు గజం రూ.39 వేల వరకు పలికింది. మొత్తం రూ.46 కోట్ల ఆదాయం వచ్చింది. మంగళవారం కూడా మరిన్ని ప్లాట్లకు వేలం జరగనుంది. ప్రభుత్వ ప్లాట్లు కావడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.