బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.