Ramatheertham Temple Idols Nimajjanam: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై కోదండ రామస్వామి ఆలయం ఉంది. అయితే ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని సోమవారం రోజు నిమజ్జనం చేయనున్నారు. అలాగే సీత, లక్ష్మణ పాత విగ్రహాలు కూడా నిమజ్జనం చేయనున్నారు. 2020లో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఈ విగ్రహాలను నిమజ్జనం చేయడం కుదరలేదు.. కోర్టు ఆదేశాలు రావడంతో నిమజ్జనం చేయడానికి సిద్ధమయ్యారు.