రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేలా.. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 విజయ డెయిరీ పార్లర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద మహిళా సంఘాలకు ప్రాధాన్యత ఇస్తూ వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.