రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయం.. ఆ ఒక్క రోజే 5. 13 లక్షలు.. ఇదే రికార్డు!

7 months ago 22
తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత స్వామివారి లడ్డూ ప్రసాదాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా తిరుమలకు వెళ్లే లడ్డూలు తెమ్మని ప్రత్యేకంగా చెబుతారు. ఈ క్రమంలో గతేడాది అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతేడాది 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి, ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 10 శాతం ఎక్కువ. డిసెంబర్ 27న ఒకే రోజు 5.13 లక్షల లడ్డూలు అమ్ముడై కొత్త రికార్డు సృష్టించింది. భక్తుల విశ్వాసం పెరగడంతో టీటీడీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
Read Entire Article