నారాయణపేట జిల్లా మక్తల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ పతాకావిష్కరణ చేస్తుండగా జెండా కర్ర విరిగిపడింది. మంత్రి తృటిలో తప్పించుకున్నా, పక్కనున్న ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. జెండా కర్ర నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు విమర్శలు గుప్పించారు.