హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉత్తర తెలంగాణలోని నిర్వాసితులకు రెండు విడతలుగా ఎకరాకు రూ.42 లక్షల వరకు పరిహారం అందించనున్నారు. తొలి విడతలో రూ.13 నుంచి రూ.15 లక్షలు, రెండో విడతలో రూ.22 నుంచి రూ.25 లక్షల వరకు చెల్లిస్తారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.