విశాఖలోని రుషికొండ భవనాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంది. రుషికొండ ప్యాలెస్ను ఎలా ఉపయోగించాలనే దానిపై ప్రజలు తమ సలహాలు, సూచనలు పంచుకోవచ్చని ఏపీ పర్యాటక శాఖ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మెయిల్ ఏర్పాటు చేసింది. rushikonda@aptdc.inకు మెయిల్కు ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపవచ్చని ఏపీ టూరిజం అథారిటీ సీఈవో ఆమ్రపాలి వెల్లడించారు. ఈ సలహాలు, సూచనలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుందని.. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.