ఓ రైతు తన భూమిని విక్రయించేందుకు.. ఎవరూ ఊహించని ఆఫర్ ప్రకటించాడు. తనకు ఉన్న 4 ఎకరాల భూమిని.. కేవలం రూ.10 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చని ఒక ప్రకటన చేశాడు. అయితే ఆ భూమిని ఎవరు గెలుచుకున్నారో తెలిపేందుకు లక్కీ డ్రా పద్దతి నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. కానీ అందుకు కనీసం 1500 మంది అయ్యే వరకు లక్కీ డ్రా తీసేది లేదని తేల్చి చెప్పాడు. దీనికి సంబంధించిన ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా?