Biryani Offer: బిర్యానీపై ఉన్న మక్కువతో నల్గొండలో ప్రజలు భారీగా క్యూ కట్టారు. నల్గొండలోని సాయి శ్రీ కాలనీలో కొత్తగా ప్రారంభమైన ‘సుగాలి ఫ్యామిలీ రెస్టారెంట్’ తమ ఓపెనింగ్ రోజున ఐదు రూపాయలకే ప్లేట్ బిర్యానీ ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. ఈ వార్త తెలియగానే హోటల్ తెరవకముందే వందలాది మంది బిర్యానీ ప్రియులు బారులు తీరారు. సాధారణంగా వందల్లో ఉండే బిర్యానీ ధర.. కేవలం ఐదు రూపాయలకే లభించడంతో జనం ఎగబడ్డారు.