Action Against 11 R and B Engineers: ప్రభుత్వంలో వందల కోట్లు ఖర్చు పెట్టి నాసిరకంగా రోడ్లు నిర్మించారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈక్రమంలో చిత్తూరు జిల్లాలో నాసిరకం రోడ్లకు బాధ్యులుగా చేస్తూ.. 11 మంది ఆర్ అండ్ బీ ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. నిబంధనలు పాటించకుండా, కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టారని విజిలెన్స్ విచారణలో తేలింది. పనులు చేయకుండానే డబ్బులు తీసుకున్న కాంట్రాక్టర్ల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆదేశించింది.