ఐటీకి కారిడార్కు కూతవేటు దూరంలోని గాజులరామారం ప్రాంతంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములను రాజకీయ నేతలు, అధికారులు కలిసి కబ్జా చేసిన ఘటన ఇది. మూడున్నరేళ్లలోనే వందకుపైగా ఎకరాలను ఆక్రమించుకున్నారు. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి.. వాటిని పేదలకు రూ.10 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి.. కబ్జాదారుల చెర నుంచి భూమిని వెనక్కి తీసుకుంటోంది.