కరువుసీమగా పేరొందిన అనంతపురం జిల్లాలో ఓ పంట రైతుల కళ్లల్లో ఆశలు చిగురించేలా చేస్తోంది. అదే చియా సాగు. కర్ణాటక రైతులు చియా సాగుతో లాభాలు గడిస్తూ ఉండటంతో.. అనంతపురం జిల్లాలోనూ కొంతమంది రైతులు ఈ పంటవైపు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, చీడపీడల బాధలు తక్కువగా ఉండటం వంటి కారణాలతో చియా సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగుకు ఎకరాకు 15 వేలు పెట్టుబడికాగా.. రూ.60 వేల వరకూ ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు.