రూ. 150 కోసం స్నేహితుల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర స్థాయికి చేరింది. మద్యం మత్తులో లక్ష్మణ్రెడ్డి అనే వ్యక్తి తన స్నేహితుడు చిరంజీవిని.. కర్రతో కొట్టి దారుణంగా హతమార్చాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే హత్య తర్వాత స్థానికంగా ఉన్న రెండు పోలీసు స్టేషన్ల మధ్య పరిధిపై కొంత గందరగోళం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు.. పరిధి నిర్ణయించి ఓ పోలీస్ స్టేషన్కు కేసు అప్పగించారు.