హైదరాబాద్ నగరంలో అక్రమార్కులకు హైడ్రా అధికారులు నిద్రలేకుండా చేస్తున్నారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించడమే కాకుండా వాటిని ఆక్రమణల నుంచి విడిపించి.. తిరిగి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకువస్తున్నారు. తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్లలో ఏకంగా రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల చెర నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 4 ప్రాంతాల్లో మొత్తం 13 ఎకరాలను రక్షించినట్లు వెల్లడించారు.