Pithapuram Sripada Vallabha Massive Donation Of Rs 2 Crores: కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి విశ్రాంత ఉద్యోగి చక్కా కుక్కుటేశ్వరరావు, ఆయన కుమారుడు వెంకట రాజేశ్వర్ రూ.2 కోట్ల విలువైన భవనాన్ని విరాళంగా అందించారు. శ్రీపాద దత్త జయంతి సందర్భంగా ఈ భారీ విరాళాన్ని ఆలయ ఈవోకు అందజేశారు. అదేవిధంగా నాలుగు రోజుల క్రితం అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానానికి ఒక దాత తన పెంకుటిల్లును విరాళంగా ఇచ్చారు.