TGSRTC Mega Modernization Plan Depots: తెలంగాణలో ఆర్టీసీ బస్టాండ్ల రూపురేఖలు మారనున్నాయి! దశాబ్దాల నాటి బస్టాండ్లను ఆధునీకరించడానికి, కొత్తవి నిర్మించడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో బస్టాండ్లు సిద్ధం కానున్నాయి. కోదాడ, హుజుర్నగర్ వంటి పలు ప్రాంతాల్లో కొత్త బస్టాండ్లు, మరికొన్ని చోట్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. 2047 నాటికి ప్రజా రవాణాను 70 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక అమలు కానుంది.