Kurnool Consumer Court Rs 55000 Fine To Hotel: వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ ముక్కలు రావడంతో ఓ వ్యక్తి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. మతపరమైన విశ్వాసాలకు భంగం కలిగించడమే కాకుండా, నిర్లక్ష్యం వహించిన డెలివరీ యాప్, హోటల్పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.55 వేల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేసింది. 45 రోెజుల్లో ఆ పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.