హైదరాబాద్ నాచారంలో రిపబ్లిక్ డే సందర్భంగా రూ. 26 వేలకే కారు ఇస్తానన్న ప్రకటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లాపూర్కు చెందిన కార్ల వ్యాపారి రోషన్, తన వద్ద ఉన్న 50 కార్లను తక్కువ ధరకు అమ్ముతానని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశాడు. ఈ ఆఫర్ చూసి వందలాది మంది ప్రజలు తెల్లవారుజామునే షోరూమ్కు చేరుకున్నారు. తీరా జనం వచ్చాక, తన వద్ద కేవలం 10 కార్లే ఉన్నాయని వ్యాపారి మాట మార్చడంతో ఆగ్రహించిన జనం అక్కడి కార్లపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.