కరీంనగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితుల మోసంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాస్ అనే వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారు. రూ. 3 కోట్లకు పైగా అప్పులు తీసుకొని.. తిరిగి చెల్లించని స్నేహితుల ద్రోహంతో తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచి మనసుతో స్నేహితులకు చేసిన సహాయం చివరకు అతడి ప్రాణాలను బలిగొంది.