కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణం కోసం టీటీడీ నిధులు సిద్ధంగా ఉన్నాయని, జనవరి 3న శంకుస్థాపన కూడా పూర్తయిందని పేర్కొంది. అయినప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. టెండర్ ప్రక్రియలో జాప్యానికి కారణం ఏంటో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై విమర్శలు గుప్పించింది.