సుమారు 3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నిందితుడైన వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్లిన ఎస్ఐ, అతడి వద్ద నుంచి రూ.2 కోట్లు లంచం తీసుకుని వదిలేశాడు. నిందితుడు పారిపోయాడని ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఎస్ఐ తీరుపై విచారణలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఎస్ఐపై ఆరోపణలున్నాయి.