రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే కృష్ణా నదిపై సోమశిల వద్ద రూ.816 కోట్లతో కిలోమీటరుకు పైగా పొడవునా ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మించనుంది కేంద్రం. దీనితో నంద్యాల, తిరుపతి ప్రయాణాలకు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించడంతో కీలక ముందడుగు పడింది. ఈ వంతెనతో రవాణా సౌకర్యంతో పాటు పర్యాటకం కూడా మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.