గత రెండేళ్లుగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పదవి దక్కింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సాయి ప్రసాద్ గురువారం జీవో జారీ చేశారు. ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్షి.. జైలు జీవితం గడిపారు. బెయిల్పై విడుదలైన అనంతరం తెలంగాణ క్యాడర్లో కొనసాగి.. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీకి వచ్చారు.