రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

1 month ago 15
తెలంగాణ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కైత్లాపూర్‌లో 62 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఆయన.. రెండో విడతలో మిగిలిన అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేటాయింపుల్లో వికలాంగులు, జర్నలిస్టులకు ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మౌలిక వసతులు, తాగునీటి సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి వివరించారు.
Read Entire Article